TSPSC Group 1 Question Paper Leak | టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పై సంచలన విషయం బయటపడింది. నిందితుడు ప్రవీణ్ ఇటీవలే గ్రూప్ 1 పరీక్ష రాసి ప్రిలిమ్స్లో 103 మార్కులు సాధించాడని పోలీసులు గుర్తించారు. దీంతో గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ చేశాడా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ప్రవీణ్ రాసిన పేపర్ తో పాటు అతడికి వచ్చిన కోడ్ ప్రశ్నపత్రాన్ని పోలీసులు, టీఎస్పీఎస్సీ అధికారులు విచారణ చేపట్టారు. అసలు ప్రవీణ్ కు 150కి 103 మార్కులు వచ్చేంత ప్రతిభ ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్ ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నారు. పేపర్ లీక్ అయిందా లేదా అనేదానిపై నిపుణులు తనికీ చేస్తున్నారు. ఏఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!