Delhi Mayor Election | ఎన్నో వివాదాలు, ఆందోళనల మధ్య ఎట్టకేలకు ఢిల్లీ మేయర్ ఎన్నిక పూర్తయ్యింది. నగరానికి నూతన మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబేరాయి విజయం సాధించారు. బుధవారం నిర్వహించిన ఎన్నికల్లో ఆమె 34 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో షెల్లీ ఒబేరాయ్కు 150, బీజేపీ అభ్యర్థికి 116 ఓట్లు వచ్చాయి.
బుధవారం ఉదయం 11.30 గంటలకు మున్సిపల్ హౌస్లో మీటింగ్ ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, హనస్రాజ్లు ముందుగా ఓటేశారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు ఓట్లు వేసిన తర్వాత కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ నేత మహమ్మద్ ఇక్బాల్ ఉప మేయర్గా ఎన్నికయ్యారు.
ఒబేరాయ్ విజయం నేపథ్యంలో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఈ విజయంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పందించారు. ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో విజయం సందర్భంగా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈ విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గూండాలు ఓడిపోయారు, ప్రజలు గెలిచారంటూ ఆయన ట్వీట్ చేశారు. నామినేటెడ్ సభ్యుల ఓటింగ్ విషయంలో ఆప్-బీజేపీల మధ్య నెలకొన్న ఘర్షణ నేపథ్యంలో మేయర్ ఎన్నిక మూడు సార్లు వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 6న ఎన్నిక జరగాల్సి వుండగా బీజేపీ-ఆప్ ఘర్షణల నేపథ్యంలో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత ఎన్నికలను జనవరి 24, ఫిబ్రవరి 6 న నిర్వహించాల్సి వుండగా బీజేపీ-ఆప్ వార్ రిపీట్ కావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఆప్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Ram Charan | అమెరికాలోనూ అయ్యప్ప మాల.. రామ్ చరణ్ ట్రెండింగ్ గురూ..!
Megastar Chiranjeevi | చిరంజీవి వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడా.. మెగా ప్లాన్ మామూలుగా లేదుగా..!
Hansika Motwani | తొందరగా పెద్దగా అవ్వాలని హన్సిక ఇంజెక్షన్లు ఇప్పించుకుందా?
NTR | నందమూరి ఫ్యామిలీకి శాపం తగిలిందా? ఎన్టీఆర్ వారసులంతా సడెన్గా చనిపోతున్నారెందుకు?