Home Latest News Telangana Congress | కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ.. రేణుకాచౌదరి కీలక వ్యాఖ్యలు

Telangana Congress | కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ.. రేణుకాచౌదరి కీలక వ్యాఖ్యలు

Telangana Congress | తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి అన్నారు. బీఆర్ఎస్‌లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారని వ్యాఖ్యానించారు. పేర్లు, రంగులు మార్చినంత మాత్రాన ప్రజలు ఇప్పుడు నాయకులను నమ్మే పరిస్థితి లేదని ఆమె అన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రేణుక.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు.

ఖమ్మం జిల్లా, కాంగ్రెస్ ఖిల్లా అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో 4 లక్షలకు పైగా ఓట్లు సాధించామని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి క్లీన్‌స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందుత్వ ముసుగులో బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. ఇక తాను ఖమ్మంలోనూ ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ప్రకటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More:

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

Chandrababu | తెలంగాణలో టీడీపీ మళ్లీ పుంజుకుంటే నష్టం ఎవరికి ? లాభం ఎవరికి .. చంద్రబాబు ఎత్తుగడ అదేనా!

Roja Vs Nagababu | జబర్దస్త్ మాజీ జడ్జీల మధ్య మాటల యుద్ధం.. అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది.. నాగబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

Breaking News | గుండెపోటుతో చిన్నకొడుకు.. శ్మశానానికి తరలిస్తుండగా పెద్దకొడుకు.. గంట వ్యవధిలో ఇద్దరు మృతి.. మెట్‌పల్లిలో విషాదం

Saleswaram Temple | నల్లమలలో ఉన్న సలేశ్వరం ప్రత్యేకత తెలుసా? ఏడాదిలో కొన్ని రోజులే ఈ గుడి తెరుస్తారు.. కారణమిదే!

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… నేరుగా రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ?

Exit mobile version