Home Latest News Bharat Jodo Yatra | కరోనా నేపథ్యంలో రాహుల్ జోడో యాత్రపై కేంద్రం కీలక ఆదేశాలు.....

Bharat Jodo Yatra | కరోనా నేపథ్యంలో రాహుల్ జోడో యాత్రపై కేంద్రం కీలక ఆదేశాలు.. అలా చేయకుంటే యాత్రను ఆపేయండి!

Bharat Jodo Yatra | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న జోడో యాత్రపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. జోడో యాత్రలో పాల్గొనే వాళ్లందరూ మాస్కులు ధరించాలని ఆదేశించింది. ఈ మేరకు రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు లేఖలు రాసింది. ఒకవేళ నిబంధనలు పాటించడం సాధ్యం కాని పక్షంలో యాత్రను నిలిపివేయాలని సూచించింది.

జోడో యాత్రలో పాల్గొనే వారంతా కచ్చితంగా మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లు ఉపయోగించాలని, డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయాలని రాహుల్ గాంధీ, అకోశ్ గెహ్లాట్ కు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ పేర్కొన్నారు. చైనాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోయి ఆస్పత్రులన్నీ నిండిపోవడంతో తాజా ఆదేశాలు జారీ చేసింది.

కాగా, భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌ నుంచి బుధవారం హరియాణాలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాత్ర ద్వారా విద్వేష విపణిలో ప్రేమను పంచే దుకాణాన్ని ప్రారంభిస్తున్నామని అన్నారు. దూషించడం, ద్వేషించడం వారి నైజం అయితే అందరినీ ప్రేమించే మనసు నాది అంటూ రాహుల్ గాంధీ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

TTD EO Dharmareddy | జనవరిలో పెళ్లి.. పత్రికలు పంచుతూ గుండెపోటుతో కన్నుమూసిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు

TR fires on Bandi Sanjay | నేను క్లీన్‌చిట్‌తో వస్తా.. చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా ? బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్

Corona | ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోందా ? అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ !

China | చైనాలో కరోనా తెచ్చిన కష్టం.. నిమ్మకాయల కోసం ఎగబడుతున్న జనాలు.. కారణమిదే

Exit mobile version