Vijayasai reddy | ఆంధ్రప్రదేశ్పై సవతి ప్రేమ చూపించడం సరికాదంటూ కేంద్రంపై వైఎస్ఆర్సీపీ ( YSRCP ) ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్రాప్రియేషన్ బిల్లు 2022పై రాజ్యసభలో చర్చ సందర్భంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి.. ఏపీ విభజన హామీల విషయంలో కేంద్రం విఫలమైందన్నారు. అన్ని అవకాశాలు ఉన్నా కేంద్రం దృష్టి సారించడం లేదని విమర్శించారు.
ఆస్తుల పంపకం విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు అమలు లోపభూయిష్టంగా ఉందన్న విజయసాయి రెడ్డి.. దీనికి యూపీఏ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. 2010-11 ధరలతో ఇప్పుడు ప్రాజెక్టు కట్టమంటే కాంట్రాక్టర్లు ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు. నష్టాలు వస్తాయని తెలిసి, వాటిని భరించేందుకు ఎవరూ ముందుకు రారని అన్నారు.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులకు ఖర్చుచేసిన డబ్బులను కేంద్రం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2014 ఏప్రిల్ 1 నుంచి 2022 అక్టోబర్ వరకు పోలవరం ప్రాజెక్టుకు 13 వేల 226 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసినట్లు తెలిపారు.
Read More Articles |
Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్
Koo vs Twitter | కూ సంస్థకు షాకిచ్చిన ట్విట్టర్.. అకౌంట్ తొలగింపు
Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా నిలిచిన వైజాగ్ టీచర్