Gas cylinder for Rs. 500 | కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్లో అక్కడి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దారిద్ర్య రేఖకు ( BPL ) దిగువన ఉన్నవారికి రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. ఉజ్వల్ పథకం లబ్దిదారులకు ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తామన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్లోని అల్వార్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ సమక్షంలోనే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు.
రాజస్థాన్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్లపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజస్థాన్లో ఐదేళ్లకు ఒకసారి అధికారం మారుతోంది. కాగా, రాజస్థాన్ కాంగ్రెస్లో ఇప్పటికే గెహ్లాట్, సచిన్ ఫైలట్ మధ్య అగ్గిరాజుకుంటోంది. సచిన్ పైలట్పై ఇటీవలే గెహ్లాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం సచిన్కు లేదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సచిన్ అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. రాహుల్ జోక్యంతో గొడవ కాస్త సద్దుమనిగినట్లు అనిపించినా.. ఎలక్షన్ల వరకు పరిస్థితి ఎలా మారుతుందో అని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.
Read More Articles |
Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్
Koo vs Twitter | కూ సంస్థకు షాకిచ్చిన ట్విట్టర్.. అకౌంట్ తొలగింపు
Mrs world | 21 ఏళ్ల తర్వాత భారత్కు దక్కిన మిసెస్ వరల్డ్ కిరీటం.. విజేతగా నిలిచిన వైజాగ్ టీచర్