Same Sex Marriage | స్వలింగ వివాహాలకు చట్టబద్దమైన గుర్తింపును ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థలో పురుషులు పురుషులతో, మహిళలు మహిళలతో కలిసి జీవించడం, లైంగిక సంబంధం కలిగి ఉండటాన్ని కుటుంబంగా పరిగణించలేమని అఫిడవిట్లో స్పష్టం చేసింది.
స్వలింగ వివాహాలకు గుర్తింపును కోరుతూ ఇటీవలకాలంలో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సోమవారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ పిటిషన్లపై కేంద్రం వైఖరిని తెలపాలని సుప్రీంకోర్టు కోరింది. దీంతో విచారణ ప్రారంభానికి ముందే కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. భారతదేశ సంస్కృతికి, జీవన విధానానికి స్వలింగ వివాహాలు విరుద్ధమని న్యాయస్థానానికి తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహానికి సంబంధించి చట్టాలు చేయడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. 1954 స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా స్వలింగ వివాహాలకు గుర్తింపునివ్వడం కుదరదని తేల్చి చెప్పింది.
ఇటీవల దేశంలో చాలా చోట్ల స్వలింగ వివాహాలు జరిగాయి. వారితో పాటు విదేశాల్లో స్వలింగ వివాహాలు చేసుకున్న వాళ్లు కూడా తమకు మ్యారేజి సర్టిఫికెట్ కావాలని అడుగుతున్నారు. తమ వివాహాలను గుర్తించాలని కోరుతున్నారు. కానీ వీటిని ప్రభుత్వం గుర్తించడం లేదు. అందుకే దేశంలో ఎక్కడా కూడా ఈ పెళ్లిళ్లను రిజిస్టర్ చేయడం లేదు. దీంతో ఎల్జీబీటీ కమ్యూనిటీ ఆందోళన చేపట్టింది. స్వలింగ వివాహాలు చేసుకున్న వారితోపాటు ఎల్జీబీటీ ప్రతినిధులు అందరూ కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్వలింగ సంపర్కుల వివాహాలను గుర్తించాలని కోరారు. ఈ క్రమంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ వారికి అశనిపాతంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై సోమవారం నుంచే విచారణ మొదలు కానుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం