Bandi Sanjay | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. మరోసారి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో దీన్ని సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 15న వ్యక్తిగతంగా విచారణకు రావాలని ఆదేశించింది. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున 18న విచారణకు హాజరవుతానని బండి సంజయ్ కోరారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ శనివారం రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యారు. బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి కార్యాలయానికి వెళ్లిన ఆయన రెండు పేజీల లేఖలో రాత పూర్వక వివరణ ఇచ్చారు. కవితను ఉద్దేశించి చేసిన మాటలను ఈ సందర్భంగా ఆయన సమర్థించుకున్నారు. తెలంగాణ వాడుక భాషలో ఉపయోగించే పదాలతో తాను మాట్లాడినట్లు సమాధానమిచ్చారు. అయితే బండి సంజయ్ ఇచ్చిన సంజాయిషీకి మహిళా కమిషన్ సంతృప్తి చెందలేదని.. దీనిపై మరోసారి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, కమిషన్ చేసిన సూచనలకు కట్టుబడి ఉన్నానని విచారణ అనంతరం మీడియా ముందు వెల్లడించారు. తప్పు చేయలేదు కాబట్టే విచారణకు హాజరైనట్లు తెలిపారు.
బండి సంజయ్ మహిళా కమిషన్ కార్యాలయానికి వస్తున్నారని తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సంజయ్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కవితకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్కు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. దీంతో పరిస్థితి సద్దుమమణిగింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
Naveen Murder Case | నవీన్ మర్డర్ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల