Accident | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లెందు మండలం కోటి లింగాల మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
వరంగల్ జిల్లాకు చెందిన రాము, కళ్యాణ్, శివ, రణధీర్తో పాటు హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన అరవింద్ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం బూర్గంపాడు మండలం మోతెకు వెళ్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కోటిలింగాల మలుపు వద్ద ఇల్లందు నుంచి మహబూబాబాద్ వైపు వస్తున్న లారీ, ఇల్లందు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే రాము, కళ్యాణ్, శివ ప్రాణాలు కోల్పోయారు. అరవింద్, రణధీర్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అరవింద్ మృతి చెందారు.ప్రస్తుతం రణదీర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్
SBI | ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 కట్ అయినట్టు మెసేజ్ వచ్చిందా?
TTD | సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్.. మండిపడుతున్న భక్తులు
Tirumala | తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు?