Aishwarya Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె ఇంట్లో నుంచి సుమారు 60 సవర్ల బంగారం, కొన్ని వజ్రాభరణాలు కూడా దొంగతనం జరిగినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్లో దాచిన నగలు కనిపించడం లేదంటూ ఆమె పేర్కొన్నారు.
2019లో తన చెల్లి పెళ్లి కోసం ఆ నగలు వేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొన్నారు. ఐశ్వర్య తన ఇంటిలోని లాకర్లో ఉంచగా, ఈ విషయం కొంత మంది పనివారికి తెలుసునని ఆమె వివరించారు. సెక్షన్ 381 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలామ్ సినిమాతో బిజీగా ఉన్నారు.
షూటింగ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో ఈ చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఈ లాకర్ను ఆమె పలు సందర్భాల్లో వేర్వేరు ఇళ్లకు తరలించినట్టు వివరించారు. 2022 ఏప్రిల్ లో పోయస్ గార్డెన్ లోని నివాసానికి లాకర్ ను తరలించారు. 18న ఆమె లాకర్ను తెరిచి చూడగా, తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాక్ అయ్యారు.
డైమండ్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయి. తన దగ్గర పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ పై అనుమానం వ్యక్తం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
MLC Kavitha | ఎమ్మెల్సీ కవితను 10 గంటలకు పైగా విచారించిన ఈడీ.. రేపు మళ్లీ విచారణకు పిలిచిన అధికారులు
hiranjeevi vs Mohan babu | చిరంజీవితో గొడవలపై తొలిసారి నోరు విప్పిన మోహన్ బాబు
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ