Madhuri Dixit | ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తల్లి స్నేహలత (91) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని మాధురీ దీక్షిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తనకు ఇష్టమైన వారి మధ్యలో ప్రశాంతంగా తన తల్లి తుది శ్వాస విడిచారని పేర్కొంది. స్నేహలత మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
అనారోగ్యంతో స్నేహలత కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇటీవలే స్నేహలత 90వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా మాధురీ దీక్షిత్ భర్త శ్రీరామ్ నేనే స్వీట్ పోస్టు చేశారు. ఈ వయసులో కూడా తన అత్తగారు పెయింటింగ్ చేస్తారని.. ఆమె ప్రపంచంలోనే అత్యంత మనోహరమైన, సానుకూలమైన వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆమె ప్రతిభను ఎల్లప్పుడూ గుర్తిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు కొద్దిరోజులుగా ఆమె ఆరోగ్యం క్షీణించిందని ఆ పోస్టులో వివరించారు. మాధురి దీక్షిత్ కూడా ఆమె తల్లి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చాలా ఎమోషనల్ అయ్యింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ.. ప్రతి అమ్మాయికి నీలాంటి మంచి స్నేహితురాలు ఉండాలి. నాకోసం నువ్వు ఎంతో చేశావు. మీరు నేర్పిన పాఠాలు, చేసిన త్యాగాలు నా జీవితానికి అతిపెద్ద బహుమతులు.. మీరు ఇలాగే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటూ పోస్ట్ చేసింది.
ఇక మాధురీ దీక్షిత్ విషయానికొస్తే 1990లో సినిమాల్లోకి వచ్చి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. డ్యాన్స్ క్వీన్గా కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసింది. అయితే కెరీర్ పీక్లో ఉన్న టైమ్లోనే 199లో డాక్టర్ శ్రీరామ్ నేనేను వివాహం చేసుకుని అమెరికాలో సెటిలయ్యింది. చాలా ఏండ్లు అక్కడే ఉన్న మాధురీ.. ఇండియా తిరిగొచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సినిమాల్లో నటించడంతో పాటు.. పలు టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!