Janhvi Kapoor | బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లవ్ మ్యాటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడూ హాట్ ఫొటోలతో వార్తల్లో ఉండే జాన్వీ ప్రేమలో ఉందని కొద్దిరోజులగా ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనమడు శిఖర్ పహరియాతో జాన్వీ డేటింగ్ చేస్తుందంటూ బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ వీటిపై ఈ బ్యూటీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ అప్పుడప్పుడూఈ జంట కెమెరా కళ్లకు చిక్కుతూనే ఉంది. తాజాగా మరోసారి కూడా వీళ్లిద్దరూ కలిసి మీడియాకు కనిపించారు.
ముంబైలోని కలినా ఎయిర్పోర్టులో జాన్వీ కపూర్, శిఖర్ పహారియా ఇద్దరూ కలిసి కనిపించారు. ఆ టైమ్లో జాన్వీ కపూర్ వైట్ ట్విన్నింగ్ అవుట్ఫిట్లో కనిపించింది. నీతా అంబానీ నిర్వహించిన ఈవెంట్కు శిఖర్తో కలిసి జాన్వీ హాజరైంది. ఆ తర్వాత ముంబైకి వచ్చిన వాళ్లిద్దరూ.. ముంబై కలినా ఎయిర్పోర్టులో మీడియా కంటపడ్డారు. ఎయిర్పోర్టు నుంచి రెండు వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీళ్లిద్దరి ప్రేమాయణం మరోసారి తెరపైకి వచ్చింది. మరి దీనిపై జాన్వీకపూర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం
Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా? dating