Gwyneth Paltrow | ఏడేళ్లుగా సాగుతున్న ఓ కేసులో హాలీవుడ్ నటి, ఐరన్మ్యాన్ హీరోయిన్ గ్వినెత్ పాల్ట్రో విజయం సాధించింది. తాను డిమాండ్ చేసినట్లుగా నష్టపరిహారం కింద ఒక్క డాలర్ను అందుకుంది. ఇప్పుడు ఈ విషయం హాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. గ్వినెత్ పాల్ట్రో 2016లో అమెరికాలోని ఉటాహ్ రిసార్ట్కు వెళ్లింది. అక్కడ స్కీయింగ్ చేస్తున్న సమయంలో టెర్రీ సాండర్సన్ అనే 76 ఏళ్ల వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో అతను గ్వినెత్ పాల్ట్రోపై కేసు పెట్టాడు. స్కీయింగ్ చేస్తూ నటి తనను ఢీకొనడంతో తన ఆరోగ్యం దెబ్బతిన్నదని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తనకు నష్టపరిహారం కింద మూడు లక్షల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే గ్వినెత్ పాల్ట్రో మాత్రం దీన్ని ఖండించింది. తన తప్పేమీ లేదని.. ఆండర్సన్ తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ అనంతరం గురువారం నాడు న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. 2016లో జరిగిన ప్రమాదంలో ఆండర్సన్దే తప్పని కోర్టు తేల్చింది. ఈ మేరకు పాల్ట్రో కోరినట్లుగా ఒక్క డాలర్ నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. నష్టపరిహారంతో పాటు లీగల్ ఫీజులు కూడా చెల్లించాలని ఆదేశించింది.