LB Nagar Flyover | ఎల్బీ నగర్ జంక్షన్కు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు త్వరలోనే ఆదేశాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఎల్బీ నగర్ జంక్షన్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణం చేపడతామని వెల్లడించారు. ఎన్నికలు పూర్తయ్యాక నిర్మాణం మొదలుపెడతామని చెప్పారు.
ఎల్బీ నగర్ జంక్షన్లో హయత్ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్లే ఫ్లై ఓవర్ను రూ. 32 కోట్లతో నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ను శనివారం కేటీఆర్ ప్రారంభించారు. ఇప్పటికే అక్కడ ఒక ఫ్లై ఓవర్ ఉంది. రెండు అండర్ పాస్లు ఉన్నాయి. తాజాగా రెండో ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ జంక్షన్ సిగ్నల్ ఫ్రీగా మారింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎల్బీ నగర్ జంక్షన్కు శ్రీకాంతాచారి పేరును పెడతామని ప్రకటించారు.
ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టిన 35వ ప్రాజెక్టును ఇవాళ ప్రారంభించామన్న కేటీఆర్ మరో 12 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇందులో ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోనే 12 పనులు ఉన్నాయని, అందులో 9 పూర్తయ్యాయని తెలిపారు. మరో 3 సెప్టెంబర్ లోపు పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
అంతేకాదు.. నాగోల్ మెట్రోను దిల్సుఖ్ నగర్ మెట్రోతో అనుసంధానం చేస్తమని కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కు మెట్రో నిర్మాణం చేపడతామన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Rahul Gandhi | సారీ చెప్పేందుకు సావర్కర్ని కాదు.. ఎంపీగా అనర్హత వేటుపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు
Sircilla | రివార్డులు వస్తాయని ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకున్న సిరిసిల్ల యువతి
Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు
Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!
Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్పుర్ గ్రామస్థులు!