Hyderabad | తన లవర్ను ప్రేమించాడని స్నేహితుడినే ముక్కలు ముక్కలుగా నరికి చంపిన బీటెక్ విద్యార్థి కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఫ్రెండ్ను అత్యంత కిరాతకంగా చంపిన యువకుడి మీదనే కాదు.. వీళ్లిద్దరూ ప్రేమించిన యువతి మీద కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్న నవీన్, హరిహర కృష్ణ ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం తెలియడంతో నవీన్పై హరిహర కృష్ణ కోపం పెంచుకున్నాడు. ఆ అమ్మాయి విషయంలో పలుమార్లు ఇద్దరికీ గొడవలు జరిగాయి. దీంతో తను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకునేందుకు అడ్డుగా ఉన్న నవీన్ను తప్పించాలని హరిహరకృష్ణ ప్లాన్ చేసుకున్నాడు. పార్టీ చేసుకుందాం రమ్మని ఈ నెల 17న హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్ శివారులోని తన రూంకి పిలిచాడు. అక్కడ పార్టీ చేసుకున్న తర్వాత జరిగిన ఘర్షణలో నవీన్ను హరిహర కృష్ణ చంపేశారు. అయితే తాజాగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవీన్ను హరి హరకృష్ణ పాశవికంగా చంపడమే కాకుండా తన ప్రేయసికి వాట్సాప్లో పంపించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
నవీన్ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ ఆ అమ్మాయిని ఫోన్ చేసి విషయం చెప్పాడు. తర్వాత నవీన్ మృతదేహాన్ని ఒక్కో భాగం కోస్తూ ఆమెకు వాట్సాప్లో ఫొటోలు పంపించాడు. ఈ వేలే కదా నిన్ను తాకింది.. ఇదిగో వేలు అంటూ ముందు ఆ ఫొటో పంపించాడు. ఈ పెదాలే కదా నిన్ను తాకింది అంటూ పెదాలు కోసి పిక్ పంపించాడు. ఈ గుండె కదా నిన్ను ప్రేమించిందని.. గుండెను కోసి దాని ఫొటో తీసి వాట్సాప్లో సెండ్ చేశాడు. తల నరికి మొండెం నుంచి వేరు చేసిన ఫొటోను కూడా ఆ అమ్మాయికి పంపించాడు. అలాగే నవీన్ మర్మాంగం కూడా కోసేశాడు. ఇలా నవీన్ను అతి క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి ఆ యువతికి ఫొటోలు పంపించాడు. ఈ రాక్షసత్వానికి ఆ అమ్మాయి ఏమాత్రం భయపడకపోగా.. అవునా.. వెరీ గుడ్ బాయ్ అంటూ హరిహరకృష్ణకు రిప్లై ఇచ్చింది. హరిహరకృష్ణ వాట్సాప్ ద్వారా ఈ విషయాలను గుర్తించిన పోలీసులు.. నవీన్ హత్య కేసులో సదరు యువతి పాత్రపై కూడా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమెను నవీన్ హత్య కేసులో నిందితురాలిగా చేర్చారు.
Follow Us : Google News, Facebook, Twitte