World Health Organization | ఉజ్జెకిస్థాన్లో 19 చిన్నారుల మృతికి కారణమైన దగ్గుమందులను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. మరియన్ బయోటెక్ తయారు చేసిన దగ్గుమందుల్లో పరిమితికి మించి డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. వీటిని ఉజ్జెకిస్థాన్లోని చిన్నారులకు వాడకూడదని ఆదేశించింది.
నోయిడాకు చెందిన మరియన్ బయోటెక్ సంస్థ అబ్రోనాల్, డాక్ 1 మ్యాక్స్ అనే రెండు దగ్గు మందులను తయారు చేసింది. డాక్ 1 మ్యాక్స్ అనే సిరప్ తాగడం వల్లే ఉజ్జెకిస్థాన్లోని 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఆరోపించింది. ఈ సిరప్ తాగిన 21 మంది పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు గురయ్యారని, వారిలో 19 మంది చనిపోయారని ప్రకటించింది. కాగా, వైద్యుల సలహాలు తీసుకోకుండానే మోతాదుకు మించి ఈ సిరప్ తాగినట్లు తెలుస్తోంది.
అబ్రోనాల్, డాక్ 1 మ్యాక్స్ దగ్గు మందులను పరీక్షించగా పరిమితికి మించి డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ ఉన్నట్లు తేలిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మరియన్ బయోటెక్ సంస్థ తయారు చేసిన మందులు నాసిరకంగా ఉన్నాయని తెలిపింది. నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో ఈ రెండు దగ్గు మందులు విఫలమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటనలో పేర్కొంది. మరియన్ బయోటెక్ సంస్థ 2012లో ఉజ్జెకిస్థాన్లో రిజిస్టర్ చేపించింది. అప్పటి నుంచి అక్కడ దగ్గు మందుల విక్రయాలు జరుపుతోంది. కాగా, గాంబియా దేశంలోనూ గతంలో హరియాణాలోని మైడెన్ ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గుమందు సిరప్ తాగి 66 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్లో అనుపమ ఫిక్స్.. అల్టర్నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు