Telangana Congress | తెలంగాణ సీఎం కేసీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరి అన్నారు. బీఆర్ఎస్లోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారని వ్యాఖ్యానించారు. పేర్లు, రంగులు మార్చినంత మాత్రాన ప్రజలు ఇప్పుడు నాయకులను నమ్మే పరిస్థితి లేదని ఆమె అన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన రేణుక.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు.
ఖమ్మం జిల్లా, కాంగ్రెస్ ఖిల్లా అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానంలో 4 లక్షలకు పైగా ఓట్లు సాధించామని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి క్లీన్స్వీప్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హిందుత్వ ముసుగులో బీజేపీ ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. ఇక తాను ఖమ్మంలోనూ ఉంటూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని ప్రకటించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More: