Bengaluru Metro pillar collapse | బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిన ఘటనలో బైక్పై వెళ్తున్న తల్లి, కుమారుడు మృతి చెందారు. తండ్రికి గాయాలయ్యాయి. బెంగళూరులోని నగవర ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
నగవర ప్రాంతం మీదుగా ద్విచక్ర వాహనంపై భార్యాభర్తలు తమ కుమారుడితో కలిసి బైక్పై హెబ్బల్ వెళ్తున్నారు. ఇదే సమయంలో నిర్మాణంలో ఉన్న ఇనుప రాడ్డులతో ఉన్న మెట్రో పిల్లర్ జారి వీరిపై పడింది. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యయి. ప్రమాదం జరిగిన వెంటనే ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలతో తల్లి తేజస్విని ( 25 ), మూడేళ్ల కుమారుడు మృతి చెందారు. తీవ్ర గాయాలైన తండ్రికి చికిత్స అందిస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More: