Uppal Match | ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో ఉత్కంఠపోరులో న్యూజీలాండ్పై భారత్ విజయం సాధించింది. 350 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ చివరి వరకూ విజయం కోసం పోరాడింది. అయితే చివరి రెండు ఓవర్లలో భారత బౌలర్లు విజృంభిచడంతో 337 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివర్లో కివీస్ బ్యాటర్ బ్రాస్ వెల్ సెంచరీతో చెలరేగినా ఫలితం మాత్రం దక్కలేదు. భారత బ్యాట్మన్ శుభ్మన్ గిల్ ( 208 ) డబుల్ సెంచరీతో అలరించగా.. సొంత గ్రౌండ్లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసి న్యూజీలాండ్ను దెబ్బతీశాడు.
శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ..
కివీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత ఓపెనర్ శుభ్మన్ గిల్ రెచ్చిపోయాడు. 149 బంతుల్లో డబుల్ సెంచరీ ( 208 పరుగులు ) సాధించి రికార్డు సృష్టించాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేయగలిగింది. ఓపెనర్గా బరిలో దిగిన గిల్ 145 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. 87 బంతుల్లో సెంచరీ మార్కును.. 122 బంతుల్లో 150 పరుగుల మార్కును దాటిన గిల్.. మరో 23 బంతుల్లో 50 పరుగులు చేసి కెరీర్లో తొలి డబుల్ సెంచరీ చేశాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత క్రికెటర్గా శుభ్మన్ గిల్ నలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు డబుల్ సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీలు చేయడం విశేషం.
టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ బరిలో దిగారు. 60 పరుగులు వద్ద 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. కోహ్లీ 8 పరుగులు, ఇషాన్ కిషన్ 5 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు. రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు, హార్దిక్ పాండ్యా 28 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 12 పరుగులు, శార్దూల్ ఠాకూర్ 3 పరుగులు మాత్రమే చేశారు. కుల్దీప్ యాదవ్ 5, షమీ 2 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఇక కివీస్ బౌలర్లలో షిప్లే, డారిల్ మిచెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఫెర్గూసన్, టక్నిర్, శాంటర్న్ తలో వికెట్ తీశారు.
భారీ విజయలక్ష్యంతో బరిలో దిగిన న్యూజీలాండ్ ఆరో ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. సొంత గ్రౌండ్లో సిరాజ్ తొలి వికెట్ తీశాడు. శార్డూల్ వేసిన 13 వ ఓవర్ చివరి బంతికి ఫిన్ అలెన్ ఔటయ్యాడు. 16వ ఓవర్లో హెన్రీ నికోల్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 18 ఓవర్లో డారిల్ మిచెల్ కూడా ఔల్డయ్యాడు. దీంతో కివీస్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఆచుతూచి ఆడినప్పటికీ 25 ఓవర్లక్ష గ్లెన్ ఫిలిప్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 29వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో టామ్ లేథమ్ ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత కివీస్ బ్యాటర్లు దూకుడు పెంచారు. న్యూజీలాండ్ బ్యాటర్ 57 బంతుల్లో బ్రాస్వెల్ సెంచరీ చేశాడు. చివరి వరకు కివీస్ బ్యాటర్లు గెలుపు కోసం చేసిన ప్రయత్నాన్ని భారత బౌలర్లు అడ్డుకున్నారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ , శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు, హార్దిక్ పాండ్యా, షమీ తలో వికెట్ తీశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Junior NTR | యంగ్ టైగర్ని కలిసిన టీమిండియా ఆటగాళ్లు..ఎక్కడంటే!
UPPAL STADIUM | ఉప్పల్ ఉప్పొంగేనా.. రేపు భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే
Hockey World Cup 2023 | హాకీ వరల్డ్ కప్లో భారత్ – ఇంగ్లాండ్ మ్యాచ్ డ్రా
Hockey World Cup | ఆరంభం అదుర్స్.. స్పెయిన్పై భారత్ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్
Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 ప్రపంచ కప్లో భారత్ విజయం.. దంచికొట్టిన ఓపెనర్లు