CM KCR | ఖమ్మం సభలో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి గల కారణాన్ని వివరించారు. దేశానికంటూ ఓ నిర్ధిష్ట లక్ష్యం లేకుండా పోయిందని కేసీఆర్ తెలిపిన ఆయన.. భారత్లోని పరిస్థితులను ఇతర దేశాలతో పోల్చారు.
మన దేశంలో 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి.. కానీ మనం కేవలం 20 వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ జింబాబ్వే దేశంలోని జాంబేజి నది మీద 6,533 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉంది. రష్యాలో అంగారా నదిపై 5,968 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఓల్టా నదిపై 4,944 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఈజిప్టు నైలు నదిపై 4500 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. చైనాలో యాంగ్జీ నదిపై 1400 టీఎంసీల ప్రాజెక్టు, అమెరికాలోని కొలరాడోలో 1200 టీఎంసీల ప్రాజెక్టు ఉంది.’ అని కేసీఆర్ తెలిపారు. మరి మన దేశానికి ఏమైందని ప్రశ్నించారు. కరువు కాటకాలు, వరదలను చూస్తున్నాం.. మనకు ఇలాంటి ప్రాజెక్టులు మనకు ఒక్కటి కూడా వద్దా?.. దయచేసి ఆలోచించాలని దేశ ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇలాంటి వాటిని ప్రశ్నించేందుకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే బీఆర్ఎస్ పుట్టిందని స్పష్టం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
KCR | వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతాం.. ఖమ్మం సభలో తెలంగాణ సీఎం కేసీఆర్
IT Rides | హైదరాబాద్లో మరోసారి ఐటీ రైడ్స్.. ఈసారి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లపై!
CM KCR | బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఇవి అమలు చేస్తాం.. సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన
CM KCR | ఖమ్మం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లులు
Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్పై కేరళ సీఎం ప్రశంసలు