Byreddy Siddharth Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్పై వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మండిపడ్డారు. వాళ్ల ప్రవర్తన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కాదు కదా.. రెండు మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని సెటైర్ వేశారు. టీడీపీ మీటింగ్లకు వచ్చిన మహిళల్లో కొందరు జై జగన్ అని అంటుంటే.. ఇంకొందరు నిన్ను నమ్మం బాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడో హైదరాబాద్లో ఉండి రాజకీయం చేయడం కాదు.. వచ్చి ఆంధ్రాలో ఇల్లు కట్టుకుని రాజకీయాలు చేయాలని.. లేదంటే మిమ్మల్ని జనం నమ్మే పరిస్థితి లేదని టీడీపీ మీటింగ్ల్లో వాళ్ల కార్యకర్తలే చెబుతున్నారని గుర్తు చేశారు.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కూడా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంగళగిరిలో ఒక్క సీటు గెలవలేని వ్యక్తి.. ఓ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడా అని ఎద్దేవా చేశారు. లోకేశ్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చవిచూడటం ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు అవినీతిపై వేల పేజీలతో పుస్తకాలు వేయొచ్చని ఆయన అన్నారు. సీమన్స్ కంపెనీ పేరుతో రూ.250 దోచుకున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. సీమన్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై లోతుగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జాదూ అనే పదానికి చంద్రబాబు, లోకేశ్ సరిగ్గా సరిపోతారని విమర్శించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా న్యాయస్థానంలో గెలిచిన ముఖ్యమంత్రి అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. జగన్ నిత్యం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని పేర్కొన్నారు. చంద్రబాబులా అబద్ధపు హామీలు ఇచ్చే అలవాటు తమకు లేదని తెలిపారు. ఐదేళ్లలో అన్ని హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Koratala Siva | జూనియర్ ఎన్టీఆర్ కోసం మిర్చి రోజుల్లోకి వెళ్లిపోయిన కొరటాల..!
Roshan Meka | శ్రీకాంత్ కొడుకు ఎక్కడ.. పెళ్లి సందడి తర్వాత మాయమయ్యాడేం..?
Kalyanram | కళ్యాణ్ రామ్ నెక్ట్స్ సినిమా కూడా రిస్కే.. డేంజర్ డెవిల్..!