Accident | న్యూఇయర్ జోష్ ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు ఇద్దరు అమాయకుల ప్రాణాలు తీశాడు. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హెచ్చరికలు జారీ చేసినా మందుబాబుల ఆగడాలకు అమాయకులు బలికావాల్సి వచ్చింది. ఫలితంగా కొత్త సంవత్సరం నాడే రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు కారును వేగంగా నడుపుతూ రోడ్డు పక్కన టిఫిన్ చేస్తున్న అమాయకులపై దూసుకొచ్చారు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
అంతటితో ఆగకుండా దగ్గర్లో ఉన్న మరో రెండు కార్లను ఢీకొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు గుర్తించారు.
Read More Articles |
Pavitra Naresh | పవిత్ర లోకేశ్కు లిప్ కిస్ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పిన నరేశ్
Poorna | తల్లి కాబోతున్న నటి పూర్ణ.. న్యూఇయర్ వేళ గుడ్న్యూస్ షేర్ చేసుకున్న మలయాళ బ్యూటీ