Poorna | సినిమాల కంటే కూడా ఢీ షోతో పాపులారిటీ సంపాదించుకుంది నటి పూర్ణ అలియాస్ షామ్నా ఖాసీమ్. ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో జడ్జిగా చేస్తూనే టీమ్ లీడర్స్తో కలిసి ఆమె చేసే ఫన్ బుల్లితెర ఆడియన్స్కు దగ్గర చేసింది. ఆమె ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్కి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ మధ్యనే దుబాయికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ చేసిన పూర్ణ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పింది. న్యూఇయర్కి ముందు రోజుతన తన సంతోషాన్ని ఫ్యాన్స్తో పంచుకుంది.
దుబాయ్కి చెందిన బిజినెస్ మ్యాన్ ఆసిఫ్ అలీతో పూర్ణ ఈ ఏడాది జూన్లో వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కొంతకాలంగా అలీతో ప్రేమలో ఉన్న పూర్ణ.. పెద్దలను ఒప్పించి మరీ ఈ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తాజాగా తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని యూట్యూబ్ ద్వారా అభిమానులతో పంచుకుంది పూర్ణ. కొత్త సంవత్సరం ముందు గుడ్న్యూస్ చెప్పడంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
శ్రీమహాలక్ష్మీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మలయాళీ భామ పూర్ణ. దశాబ్దానికి పైగా సినిమాల్లో కొనసాగుతున్న ఈమెకు సీమ టపాకాయ్, అవును సినిమాలు మాత్రమే గుర్తింపు తీసుకొచ్చాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర మీద న్యాయనిర్ణేతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది పూర్ణ. వెండితెరపై అంతగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ.. ఢీ షోతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. బుల్లితెరపై కొద్దిరోజులుగా బిజీగా ఉన్న పూర్ణ.. ప్రెగ్నెన్సీ కారణంగా కొద్దిరోజులు షూటింగ్లు అన్నింటికీ దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది.
Read More Articles:
Telangana Congress | టీ కాంగ్రెస్ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్.. త్వరలో కొత్త ఇంఛార్జి
Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్లోనే మృతి
Telangana IPS | తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రకు అదనపు బాధ్యతలు
Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్