TSPSC Paper leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ బయటకొస్తోంది. గ్రూప్-1 పేపర్ లీకైనట్లు ఇద్దరు కమిషన్ ఉద్యోగులకు ముందుగానే తెలుసని సిట్ విచారణలో వెల్లడైంది. గ్రూప్1 పేపర్ను ప్రవీణ్కుమార్, రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ అక్టోబర్లో లీక్ చేశారు. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేశ్ అప్పుడే గుర్తించారు. దీంతో వాళ్లిద్దరూ పేపర్ లీకేజీ విషయాన్ని ఉన్నతాధికారుల దగ్గర బయటపెడతారేమోనని వారిని ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ప్రలోభ పెట్టారు. వాళ్లకు కూడా గ్రూప్-1పేపర్ ఇస్తామని.. ఎగ్జామ్ రాసి ఉద్యోగం సంపాదించుకోవచ్చని ఆశజూపారు. దీంతో షమీమ్, రమేశ్ కూడా పేపర్ తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయారు.
షమీమ్, రమేశ్ నుంచే న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్, సైదాబాద్కి చెందిన సురేశ్కు పేపర్ చేరిందని సిట్ విచారణలో తెలిసింది. వీళ్ల ద్వారా ఇంకా ఎంతమందికి పేపర్ లీకైందనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో షమీమ్, రమేశ్, సురేశ్ను విచారించేందుకు ఐదు రోజుల పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఇవాల్టి నుంచి ఈ ముగ్గురిని సిట్ అధికారులు విచారించనున్నారు. కాగా, పేపర్ లీకేజీలో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, ఢాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్ల మూడు రోజుల కస్టడీ ముగిసింది. వీరి నుంచి కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరించారు.
మరో పరీక్ష వాయిదా
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంతో గ్రూప్-1, అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్షలతో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేసిన కమిషన్ తాజాగా మరో పరీక్షను వాయిదా వేసింది. ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల పరీక్షను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ వెల్లడించారు. అలాగే రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్సను జూన్ 11వ తేదీన నిర్వహించనున్నట్టు గతంలోనే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ పేపర్ లీకేజీ ఉదంతంతో ఏప్రిల్లో నిర్వహించాల్సిన పలు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తులు చేస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?
Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి
Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం
IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య
Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు
World Idli Day | మనం రెగ్యులర్గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?