Fire Accident | సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. భవనంలో నాలుగు, ఐదు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. నాలుగో అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి బయటకు తీసుకొచ్చారు. అయితే ఐదో అంతస్తులో చిక్కుకున్న శివ, ప్రమీల, వెన్నెల, శ్రావణి, ప్రశాంత్, త్రివేణి మృతి చెందారు.
అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భవనంలో పలువురు చిక్కుకున్న విషయం తెలుసుకుని వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో దాదాపు 12 మందిని రక్షించారు. అయితే ఐదో ఫ్లోర్లో చిక్కుకున్న ఆరుగురు ఒక బాత్రూంలోకి వెళ్లి లాక్ వేసుకున్నట్లు తెలుస్తోంది. డోర్లు బద్దలుకొట్టి వీరిని అగ్నిమాపక సిబ్బంది కిందకు తరలించారు. అయితే అప్పటికే స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి ఆరుగురు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా 25 ఏళ్ల లోపు వయసు వారే. వీరంతా ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pawan Kalyan | రోజుకు 2 కోట్లు.. వైరల్గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్
Junior NTR | ఎంత పని చేశావు తారక్.. ఫ్యాన్ వార్ కు పెట్రోల్ పోసాడుగా..!
Oscars 2023 | ఆస్కార్ అవార్డు పోగొట్టుకుంటే ఎలా? అప్పుడు అకాడమీ ఏం చేస్తుంది?
Silicon Valley Bank | 100 రూపాయలకే సిలికాన్ వ్యాలీ బ్యాంకు యూకే యూనిట్ దక్కించుకున్న హెచ్ఎస్బీసీ