Home Latest News Selfie tragedy | సెల్ఫీ పిచ్చితో లోయలో పడిన వధూవరులు.. ఆగిపోయిన పెళ్లి

Selfie tragedy | సెల్ఫీ పిచ్చితో లోయలో పడిన వధూవరులు.. ఆగిపోయిన పెళ్లి

selfie tragedy | స్మార్ట్‌ఫోన్లు వచ్చాక సెల్ఫీల పిచ్చి ఎక్కువైంది. ఈ పిచ్చితోనే రకరకాల సాహసాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుని మురిసిపోతున్నారు.దీనికోసం ప్రమాదాలను కూడా లెక్కచేయట్లేదు. తెల్లారితే పెళ్లి పెట్టుకుని సెల్ఫీల మోజులో ఓ జంట తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంది.సెల్ఫీ దిగే ప్రయత్నంలో 120 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడినప్పటికీ.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ జంట ఆస్పత్రి బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే

కేరళలోని కొల్లాం ( Kollam ) జిల్లాలోని పరవూరుకు చెందిన విను కృష్ణన్కు, శాండ్రా ఎస్.కుమార్‌తో వివాహం జరిపించాలని ఇటీవల పెద్దలు నిర్ణయించారు. డిసెంబర్ 9న వీరి వివాహం జరిపించేందుకు ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు. పెళ్లికి ముందు తమ ఊరిలో ఉన్న ఆలయంలో పూజలు జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో వధూవరులను బుధవారం కుటుంబసభ్యులు ఆలయానికి తీసుకెళ్లారు.ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత ఆ లొకేషన్ చూసిన వధూవరులు ఫొటోలు దిగగాలని అనుకున్నారు. సమీపంలో ఉన్న క్వారీ అంచుకు వెళ్లి సెల్పీ తీసుకోవడానికి ట్రై చేశారు. ఇద్దరూ ఫొటోకు స్టిల్ ఇస్తుండగా శాండ్ర కాలు జారి 120 అడుగుల లోతులో ఉన్న లోయలో పడిపోయింది. ఆమెను కాపాడటానికి వరుడు కూడా వెంటనే లోయలోకి దూకేశాడు. శాండ్రను కాపాడి ఆ నీటిలో ఉన్న ఒక బండపై కూర్చోబెట్టాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి .. స్థానికులు, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. వధూవరులను రక్షించారు. అదృష్టవశావత్తూ ఇద్దరికీ పెద్ద గాయాలు ఏమీ కాలేదు. కాకపోతే టైమ్‌కు జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. త్వరలోనే మంచి ముహూర్తం చూసి వీరికి పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు తెలిపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Gurtunda seetakalam Review | గుర్తుందా శీతాకాలం రివ్యూ.. ఒరిజినల్‌ అంత ఎమోషన్‌గా సాగిందా?

Indian cinema | ఒకప్పుడు అక్కడి సినిమాలంటే చులకనగా చూసేవాళ్లు.. కానీ అవే సినిమాలు దుమ్ముదులిపేస్తున్నాయి.

Theri Remake | మాకొద్దు బాబోయ్ ఆ రీమేక్.. పవన్ కళ్యాణ్ సినిమాపై ఫ్యాన్స్ ఆందోళన

Exit mobile version