Home Latest News Janasena | తెలంగాణలో పోటీకి సై అంటున్న జనసేన.. అభ్యర్థులపై మొదలైన కసరత్తు

Janasena | తెలంగాణలో పోటీకి సై అంటున్న జనసేన.. అభ్యర్థులపై మొదలైన కసరత్తు

Janasena | తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టేశాయి. అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో బీఆర్‌ఎస్‌ పార్టీ బిజీగా ఉంది. పబ్లిక్‌ మీటింగ్‌లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పార్టీలో జోష్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీజేపీ కూడా ఓవైపు ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు పాదయాత్రల పేరుతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నాడు. అటు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా కాంగ్రెస్‌ కమిటీలపై కసరత్తులు చేస్తున్నాడు. నేనేం తక్కువ అన్నట్లుగా జనసేన ( Janasena ) కూడా పోటీకి రెడీ అయిపోయింది. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా పాదయాత్రలో ప్రజలతో మమేకయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా జనసేన ఒక అడుగు ముందుకేసింది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ( pawan kalyan ) తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని 32 నియోజకవర్గాల కార్యనిర్వాహకులను ఎంపిక చేసింది. ఈ మేరకు తెలంగాణ ఇంచార్జ్‌ వేమూరి శంకర్‌ గౌడ్‌ ప్రకటన విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన జాబితాలోని కార్యనిర్వాహకులు తమ నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. దాని ఆధారంగా ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ సినిమాకు మారిన టైటిల్.. ఉస్తాద్‌గా పవర్ స్టార్

Megastar chiranjeevi | చిరంజీవి, రామ్ చరణ్ అవార్డుల వెనుక రాజకీయం ఉందా ? అభిమానులు ఏమంటున్నారు ?

Theri Remake | మాకొద్దు బాబోయ్ ఆ రీమేక్.. పవన్ కళ్యాణ్ సినిమాపై ఫ్యాన్స్ ఆందోళన

Exit mobile version