Home News International Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారేమో.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Rahul Gandhi | ఆ సమయంలో నన్ను చంపేసేవారేమో.. రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కశ్మీర్లో యాత్ర చేస్తున్నప్పుడు కొందరు టెర్రరిస్టులు తన వద్దకు వచ్చారని, తనతో మాట్లాడారని, నన్ను చంపేసేవారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ భారత్‌ ఓడో యాత్ర గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

రాహుల్ గాంధీ వారం రోజులు యూకేలో పర్యటించడానికి మంగళవారం నాడే అక్కడికి చేరుకున్నారు. ఈ టూర్ లో భాగంగా కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆయన ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో చర్చలు జరిపారు. కశ్మీర్‌ రీజియన్‌ లో పాదయాత్ర చేయరాదని సెక్యూరిటీ ఫోర్స్‌లు తనకు చెప్పాయని, అక్కడ ఉగ్రవాదులు దాడులు చేసే ముప్పు ఉందని పేర్కొన్నాయని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అయినప్పటికీ తన యాత్రను కొనసాగించినట్టు వివరించారు. ‘నేను నా మనుషులతో మాట్లాడాను. ఈ యాత్రను కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నట్టు తెలిపాను. అందుకు వారు కూడా అంగీకరించారు. ముందుకు కదిలాం. కొంత దూరం పాదయాత్ర చేశాక.. గుర్తు తెలియని ఓ వ్యక్తి నా వద్దకు వచ్చాడు. నాతో మాట్లాడాలని కోరాడు’ అని వివరించాడు.

నిజంగా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే కాంగ్రెస్ నేతలు జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోకి వస్తున్నారా? అని తనను ఆ గుర్తు తెలియని వ్యక్తి అడిగినట్టు రాహుల్ చెప్పారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకు సమీపంలోని మరికొందరు వ్యక్తులను తనకు చూపించినట్టు తెలిపారు. వారంతా టెర్రరిస్టులే అని ఆ వ్యక్తి తనకు చెప్పినట్టు వివరించారు. ‘అప్పుడు నాకు నేను సమస్యలో పడ్డట్టు అనిపించింది. ఎందుకంటే టెర్రరిస్టులు తనను చంపగలిగేవారే. కానీ, వారు ఏమీ చేయలేదు. ఎందుకంటే.. అది వినడానికి ఉన్న శక్తి’ అని రాహుల్ గాంధీ తెలిపారు.

కేంబ్రిడ్జీ ప్రసంగంలో ఆయన వినే కళ (ఆర్ట్ ఆఫ్ లిజనింగ్) గురించి మాట్లాడారు.

ప్రజాస్వామ్యానికి అవసరమైన వ్యవస్థాగత నిర్మాణంపై ఆంక్షలు పెరుగుతున్నాయని, భారత ప్రజాస్వామిక ప్రాథమిక నిర్మాణంపైనే దాడి జరుగుతున్నదని రాహుల్ గాంధీ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెగాసెస్ తో తనపైనా నిఘా వేసిందని వివరించారు.

‘భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నది. ప్రజాస్వామ్యంపై దాడిని తాము ఎదుర్కొంటున్నాం’ అని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రతిపక్ష నేతలపై నిఘా వేయడానికి ప్రభుత్వం పెగాసెస్‌ను ఉపయోగించుకుంటున్నదని వివరించారు.

‘స్వయంగా నా ఫోన్‌లోనూ పెగాసెస్ చొప్పించారని వివరించారు. చాలా మంది నేతల ఫోన్‌లలో పెగాసెస్ ఉన్నదని తెలిపారు. తనపై నిఘా ఉన్నదని, ఫోన్‌లోనైనా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పారని వివరించారు. సెంటర్‌లోని ప్రభుత్వం మీడియా, జ్యుడీషియరీ, సర్వెలెన్స్, భయాందోళనలు సృష్టించడం, మైనార్టీ, దళితులు, గిరిజనులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అసమ్మతిని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Emoji | ఎమోజీల ట్రెండ్‌ ఎలా మొదలైంది? అవి పసుపు రంగులోనే ఎందుకు ఉంటాయి?

First Video on Youtube | యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటో తెలుసా

CRED CEO | ఆ కంపెనీ సీఈవో జీతం కేవలం 15 వేలే.. ఎందుకలా?

Triangle Love Story | అబ్దుల్లాపూర్‌మెట్ తరహాలో ప్రేమించిన అమ్మాయి కోసం స్నేహితుడి హత్య.. 17 నెలల తర్వాత వెలుగులోకి.. ఆస్తిపంజరమే మిగిలింది

Telangana | నిప్పులాంటి మగాడివి అయితే ఏ అగ్గి నిన్నేం చేయలేదు.. అక్రమ సంబంధం రుజువు చేయాలని పంచాయతీ పెద్దల ఆటవిక తీర్పు

Exit mobile version