Covid Cases | దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు 3 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 3095 కరోనా కేసులు నమోదు కాగా, 14 మంది మృతి చెందారు. ఈ ఏడాదిలో ఒక్కరోజులో ఇంత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గురువారం కూడా 3,016 కేసులు నమోదయ్యాయి. అయితే నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి.
దేశంలో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 15వేలు దాటింది . ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 15,208 గా ఉంది. గత 24 గంటల్లో 1390 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.78 ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రోజు రోజుకు భారీగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. కరోనా టెస్టులు పెంచాలని రాష్ట్రాలను ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
IPL 2023 | తొలి పోరుకు హైదరాబాద్ సారథిగా భువనేశ్వర్ కుమార్
PL2023 | బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్కు రంగం సిద్ధం.. ఐపీఎల్ తొలి పోరులో గుజరాత్తో చెన్నై ఢీ
Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు
Moto G13 | రూ.10వేలకే 50MP కెమెరా, డాల్బీ స్పీకర్లతో అదిరిపోయే స్మార్ట్ఫోన్