IPL 2023 | ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మూడేళ్లుగా ప్రారంభ వేడుకలు నిర్వహించలేదు. దీంతో ఈసారి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ తన గాత్రంతో ప్రేక్షకులను మైమరిపించాడు.
మరోవైపు ఆరంభ వేడుకల్లో తెలుగు పాటలు మోత మోగించాయి. సినీ నటి తమన్నా భాటియా, రష్మిక మందన్నాలు తమ డ్యాన్సులతో క్రికెట్ ఫ్యాన్స్లో జోష్ నింపారు. పుష్ప సినిమాలోని ఊ అంటావా.. ఊహూ అంటావా పాటకు తమన్నా అదిరిపోయే స్టెప్పులేసింది. అదే సినిమాలోని సామి సామి, శ్రీ వల్లి పాటలకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను హోరెత్తించింది. కాగా, ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకలకు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం
Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?