Bandi Sanjay | బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు కేటీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో కాషాయపు రాజ్యం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీజేపీని ఉత్తరాది పార్టీ అని విమర్శించారని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఏ ఉప ఎన్నిక అయినా బీజేపీనే గెలుస్తుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న బండి సంజయ్.. ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రధాని మోదీని తిడుతూ టైం పాస్ పాలిటిల్స్ చేస్తున్నారని కేసీఆర్పై ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ కొడుకు ట్విటర్ టిల్లును ప్రజలు ఉరికిచ్చి కొడతారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ మోదీని బ్రోకర్ అంటావా… నువ్వు బ్రోకర్.. నీ అయ్య పాస్ పోర్ట్ బ్రోకర్’ అంటూ కేసీఆర్, కేటీఆర్పై తీవ్ర పదజాలాన్ని వాడారు. TSPSCలో జరిగిన పేపర్ల లీకేజీ వ్యవహారంలో 30 లక్షల మంది యువత భవిష్యత్ నాశనం అయితే మీ అయ్యా ఎందుకు మాట్లాడలేదు అంటూ కేటీఆర్ను బండి సంజయ్ ప్రశ్నించారు. TSPSC బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో నీ కుటుంబం ప్రమేయం లేకపోతే సిట్టింగ్ విచారణతో జరిపించాలి అని కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణను ట్విట్టర్ టిల్లు.. లిక్కర్ క్వీన్.. హ్యాపీ రావు.. అగ్గిపెట్టే రావు ఏలుతున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో యుద్ధం కొనసాగిస్తామని, తెలంగాణలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం
Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?