SI Exam | ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇటీవల విడుదల చేసిన ప్రిలిమినరీ ఫలితాలపై తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికీ ఏడు మార్కులు కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రిలిమనరీ పరీక్షలకు ఎంపికైన కొత్త అభ్యర్థుల జాబితాను ఈ నెల 30 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది.
బహుళ సమాధానాలతో కూడిన ప్రశ్నలకు సంబంధించి అందరికీ మార్కులు కలపాలన్న టీఎస్ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 7 ప్రశ్నలకు మార్కులు కలిపిన తరువాత ప్రిలిమనరీ పరీక్షలో అదనంగా ఉత్తీర్ణత సాధించేవారికి.. ఫిజికల్ టెస్ట్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదనంగా అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను జనవరి 30 నుంచి www.tslprb.in వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
ముందుగా ప్రిలిమనరీ పరీక్షలో ఇప్పటికే ఉత్తీర్ణత సాధించిన వారు ఫిబ్రవరి 1 నుంచి 5 తేదీ వరకు పార్ట్ -2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలని తెలిపింది. వారికి ఫిబ్రవరి 15 నుంచి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని వివరించింది. ఫిజికల్ టెస్టులను హైదరాబాద్, సైబరాబాద్. వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్ లలో నిర్వహించనున్నట్లు తెలిపింది. కేవలం పది రోజుల్లోనే టెస్టుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కూడా వివరించింది.
ఎస్సై, కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ల రాత పరీక్షకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అమలు చేయాలని పలు ప్రతిపక్ష పార్టీలు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ మార్కులు కలిపేందుకు పోలీసు రిక్రూట్మెంట్ అంగీకరించడంతో అభ్యర్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Odisha Heath Minister | ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రిపై పాయింట్ బ్లాంక్లో ఎస్సై కాల్పులు.. తీవ్ర గాయాలు
Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన బాలకృష్ణ
Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?
Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ