Earthquake in Delhi NCR | దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. నోయిడాతో పాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. అప్ఘనిస్థాన్లో భూకంపం వల్లే ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, భూకంప కేంద్రం అఫ్ఘానిస్థాన్లోని కలఫ్గాన్కు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రత నమోదైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీని ప్రభావంతో అప్ఘనిస్థాన్, తుర్కమెనిస్థాన్, భారత్, కజకిస్థాన్, పాకిస్థాన్, తజకిస్థాన్, ఉజ్జెకిస్థాన్, చైనా, కిర్గిస్థాన్ దేశాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!
Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్పుర్ గ్రామస్థులు!
Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?
Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?