MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 9.40 నిమిషాలకు బయటకు వచ్చారు. బయటకు వస్తూనే పిడికిలి బిగిస్తూ.. విజయ సంకేతం చూపించారు. ఆ తర్వాత నేరుగా సీఎం కేసీఆర్ అధికార నివాసానికి బయల్దేరి వెళ్లారు. రేపు విచారణకు రావాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.
మళ్లీ విచారణకు ఎప్పుడు రావాలనేది చెబుతామని ఈడీ అధికారులు చెప్పినట్లు కవిత లీగల్ టీమ్ తెలిపింది. కాగా, మంగళవారం కవితను విచారిస్తున్న సమయంలోనే బీఆర్ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. తదుపరి విచారణలో కవితకు బదులు సోమ భరత్ని పంపించేందుకు వీలుగా డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అవసరమైన సంతకాల కోసం సోమ భరత్ను పిలిచినట్లు సమాచారం.
విచారణకు వెళ్లేముందు గతంలో తాను వినియోగించిన 10 సెల్ఫోన్లను మీడియాకు చూపించారు. కవర్లో తీసుకెళ్లి ఈడీకి వాటిని ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖర రాశారు. ఈడీ ఆరోపించిన 10 ఫోన్లను అందజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!
Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్పుర్ గ్రామస్థులు!
Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?
Raavi Chettu | రావి చెట్టు నీడ ఇంటి మీద పడితే అంత ప్రమాదామా?