Home Latest News Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్‌ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఏడు...

Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్‌ కేసులో ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ.. ఏడు గంటలకు పైగా ప్రశ్నించిన సీబీఐ అధికారులు

Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla kavitha ) విచారణ పూర్తయింది. కవిత నుంచి సీబీఐ అధికారులు వివరణ తీసుకున్నారు. రాఘవేంద్ర వస్త నాయకత్వంలో రెండు బృందాలుగా వచ్చిన అధికారులు సీఆర్‌పీసీ 160 కింద కవిత వాంగ్మూలం తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుమారు ఏడు గంటలకు పైగా కవితను ప్రశ్నించారు. కవిత స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు.

విచారణ అనంతరం సీబీఐ అధికారులు వెళ్లిపోగానే కవిత నివాసానికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన నాయకురాలికి మద్ధతుగా పార్టీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. భారీగా పార్టీ శ్రేణులు కవిత నివాసం వద్దకు చేరుకున్న నేపథ్యంలో భారీ భద్రత మధ్య సీబీఐ అధికారులను పోలీసులు పంపించారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల 6న విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు మొదట సూచించారు. అయితే ఆ రోజు తనకు ఇతర కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో 11,12,14,15 తేదీల్లో అందుబాటులో ఉంటానని సీబీఐకి కవిత లేఖ రాశారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని కవిత నివాసానికి ఆదివారం వచ్చారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

MLC Kalvakuntla Kavitha | ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్న సీబీఐ అధికారులు.. సాయంత్రం దాకా విచారణ !

TRC MLC Kalvakuntla Kavitha | నా గురించి మాట్లాడితే చెప్పుతో కొడతా.. బీజేపీ ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్

CM KCR Telangana Cabinet Key Decisions | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్

Farmers | ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. తెలంగాణలో తగ్గుముఖం: పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

Exit mobile version