Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. టెన్త్ పేపర్ లీక్ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను ఏ1గా చేర్చారు. తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ 1997లోని సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120బీ, సెక్షన్ 420 కింద కూడా కేసులు పెట్టారు. మొత్తంగా బండి సంజయ్పై 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బండి సంజయ్తో పాటు మరో 8 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఇక ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ5గా శివగణేశ్, ఏ6గా పోగు సుభాశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్, ఏ10గా పాతబోయిన వసంత్ పేర్లను చేర్చారు. ఏ4గా మైనర్ బాలుడిని చేర్చారు. వీరిలో నలుగుర్ని అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. రిమాండ్ కాపీలో ఈటల రాజేందర్ పీఏల పేర్లు కూడా ఉన్నాయి. ఈటల రాజేందర్ పీఏలు రాజు, నరేందర్కు ప్రశాంత్ క్వశ్చన్ పేపర్ ఫార్వర్డ్ చేశారని సమాచారం.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Hairsh Rao | పట్టపగలే బండి సంజయ్ దొరికిపోయిండు.. టెన్త్ పేపర్ లీకేజీ కుట్రపై మంత్రి హరీశ్ రావు ఫైర్
Bandi Sanjay | బండి సంజయ్పై పెట్టిన కేసులు ఇవే.. ఎఫ్ఐఆర్లో ఏం పేర్కొన్నారంటే..