Breaking news | సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ఓ పాఠశాలలో నిర్వహించిన సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. భోగి మంటలు వేసే క్రమంలో ముగ్గురు విద్యార్థులకు మంటలు అంటుకున్నాయి. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.
సంక్రాంతి సంబురాల్లో భాగంగా గొల్లవిల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం భోగి మంటలు వేశారు. ఈ వేడుకలు నిర్వహించే క్రమంలో ముగ్గురు విద్యార్థులకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. వీరిలో ఇద్దరు మూడో తరగతి బాలికలు కాగా.. ఒకరు ఎల్కేజీ చిన్నారి ఉన్నారు. గాయపడిన చిన్నారులను హుటాహుటిన అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
varisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్ ఫ్యాన్స్
RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు