Sharwanand | టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తొందరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. వసంత పంచమి గురువారం రోజున రక్షితారెడ్డితో శర్వ ఎంగేజ్మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్మెంట్కు మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ఉపాసన హాజరయ్యారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫొటోలను చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు శర్వానంద్ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షితా రెడ్డి విషయానికొస్తే ఆమె తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురు. ఏపీ మాజీ మంత్రి, చిత్తూరులోని శ్రీకాళహస్తి నుంచి నాలుగుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనుమరాలు అవుతుందని సమాచారం.
ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న రక్షితా రెడ్డి.. వర్క్ ఫ్రమ్ హోమ్ కాకవడంతో కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటుంది. రక్షితా రెడ్డిని శర్వానంద్ ఓ స్నేహితుడి ద్వారా కలిశాడట. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు కలవడంతో దగ్గరయ్యారని.. ఇదే విషయం పెద్దలకు చెప్పి పెళ్లికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్లో శర్వానంద్, రక్షితారెడ్డి వివాహం జరిగే అవకాశం ఉంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles: