China Corona cases | చైనాలో కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిసనప్పటి నుంచి కోట్లలో కేసులు నమోదవుతున్నాయి. చైనా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. చైనాలో అద్యధిక జన సాంద్రత కలిగిన హెనాన్ ప్రావిన్స్లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడున్న ప్రతి ఒక్కరికీ కరోనా సోకిందని అధికారులు వెల్లడించారు. ఒక్క హెనాన్ ప్రావిన్స్లోనే దాదాపు 8.85 కోట్ల మందికి కరోనా సోకిందని తెలిపారు. అది అక్కడి జనాభాలో 90 శాతానికి సమానమని, ఇంకా గుర్తించని కేసులు భారీగానే ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
ఒకవైపు హెనాన్లోనే 8.85 కోట్ల మందికి కరోనా సోకిందని స్థానిక అధికారులు పేర్కొంటే చైనా ప్రభుత్వం మాత్రం కేవలం 1.20 లక్షల మందికి మాత్రమే అక్కడ వైరస్ సోకిందని ప్రకటించింది. హెనాన్ ప్రావిన్స్లో జీరో కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కరోనా కేసులు పెద్దగా లేవు. కానీ ఆంక్షలు సడలించిన తర్వాత భారీగా పెరిగాయి. ముఖ్యంగా కోవిడ్ ఆంక్షలు సడలించడం.. కొత్త సంవత్సర వేడుకల కోసం ప్రజలు విపరీతంగా ట్రావెల్ చేస్తున్నారని, ఫలితంగానే కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క శనివారమే దాదాపు 3.4 కోట్ల మంది ప్రయాణాలు చేసినట్లు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More: