Wildfire | చిలీలో కార్చిచ్చు దావానంలా వ్యాపిస్తుంది. రాజధాని శాంటియాగోకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయోబయో, నుబుల్ ప్రాంతంలో ఏర్పడిన అగ్నికీలలు దావానంలా వ్యాపిస్తున్నాయి. వేడిగాలుల ప్రభావంతో 14వేల హెక్టార్ల అటవీ ప్రాంతం దగ్ధమైంది. ఈ మంటలు ఇప్పుడు రహదారులపైకి కూడా దూసుకొస్తున్నాయి. ఈ మంటలను అదుపు చేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సేవల బృందానికి చెందిన హెలికాప్టర్ కూడా కూలిపోయింది.
కార్చిచ్చు అదుపులోకి రాకపోవడంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అక్కడి హోంమంత్రి కరోనాలినా తోహా తెలిపారు. అటవీ సమీపంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. ప్రస్తుతానికి చిలీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
K.Viswanath | చిరంజీవి, కమల్ హాసన్కు కళాతపస్వి కె.విశ్వనాథ్ అంటే ఎందుకంత అభిమానం?
K.Viswanath | ఆ సినిమా ఎందుకు మొదలుపెట్టానని బాధపడ్డ కె.విశ్వనాథ్