Rashmika Mandanna | రష్మిక మంధన్నాపై జరిగినంత ట్రోలింగ్ ఈమధ్యకాలంలో ఎవరి మీద జరగలేదనే చెప్పాలి. పుష్ప సినిమా తర్వాత నేషనల్ క్రష్గా ఎంత పేరొచ్చిందో.. సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువే ట్రోల్స్ జరిగాయి. పేరొచ్చిన తర్వాత ఆమెకు పొగరు ఎక్కువైందని కూడా విమర్శలు ఎక్కువయ్యాయి. చాలామంది నెటిజన్స్ ఆమెను డైరెక్ట్గానే ట్రోల్ చేశారు. తాజాగా వీటన్నింటిపైనా రష్మిక స్పందించింది. తాను ఒక సెలబ్రెటీ అయినంత మాత్రాన అందరికీ నచ్చాల్సిన అవసరం లేదని ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.
నటీనటులుగా ప్రేక్షకులు అందరూ ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలని అనుకోవద్దని తెలుసుకున్నానని రష్మిక మంధన్నా తెలిపింది. సమాజంలో ప్రేమ, ద్వేషం సహజమని.. తను అందిరికీ నచ్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సినీ ఇండస్ట్రీలో కొందరికి తన ప్రవర్తన నచ్చకపోవచ్చని. తన ఎక్స్ప్రెషన్స్, చేతులతో చేసే సంజ్ఞలు నచ్చకపోవచ్చని కాంతార హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి గురించి ఇన్డైరెక్ట్గా తెలిపింది. దానికి ఎవరి కారణాలు వారికి ఉంటాయని పేర్కొంది. తనపై వస్తున్న నెగెటివిటీని పక్కన బెడితే.. తనను ప్రేమించేవాళ్లు కూడా ఉన్నారని తెలిపింది. తనను ప్రేమించేవారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపింది.
చిన్న చిత్రంగా విడుదలై పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టిన కాంతార సినిమాను చూడలేదంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. తన ఫస్ట్ సినిమా డైరెక్టర్ సినిమానే చూడలేదనడం, తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన బ్యానర్ను సోకాల్డ్ బ్యానర్ అంటూ మాట్లాడటంపై నెటిజన్లు మండిపడ్డారు. రష్మికకు పొగరు ఎక్కువ అయ్యిందంటూ ఆమెను ట్రోల్స్ చేశారు. మరోసారి సౌత్ సినిమాలపై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. రొమాంటిక్ సాంగ్స్ అంటే తనకు బాలీవుడ్ మాత్రమే గుర్తుకొస్తుందని.. సౌత్ ఇండస్ట్రీలో మాస్ సాంగ్స్ మాత్రమే ఉంటాయని రష్మిక చేసిన కామెంట్ వైరల్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా సౌత్ సినిమాలను పొగుడుతుంటే.. రష్మిక మాత్రం విమర్శిస్తుందని ఆమెపై మండిపడ్డారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Sreeleela | సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న శ్రీలీల.. కారణం అదేనా?
Samantha | మళ్లీ బిజీ అయిపోయిన సమంత.. అన్నింటికీ అదొక్కటే పరిష్కారమంటూ ఎమోషనల్ పోస్ట్