Trisha | సినీ ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది చెన్నై సుందరి త్రిష. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ చిత్రం తర్వాత తమ కెరీర్ మళ్లీ జోరందుకుంది. స్టార్ హీరోల సినిమాల్లోనూ ఛాన్స్లు దక్కించుకుంటుంది. నాలుగు పదుల వయసులోనూ హీరోయిన్గా ఫుల్ ఫామ్లో ఉన్న త్రిష గురించి సినీ ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతోంది. కోట్ల రూపాయలు పెట్టి పెద్ద బంగ్లా కొనుగోలు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే అజిత్ ఇంటి సమీపంలో త్రిష ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది. దాదాపు రూ.5 కోట్లతో ఈ ఫ్లాట్ను త్రిష కొన్నట్టు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ ఉండగానే త్రిష మరో ఇల్లు కొన్నట్టు తెలుస్తోంది. చెన్నైలో తలపతి విజయ్ ఇంటికి సమీపంలో సుమారు రూ.35 కోట్లతో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. త్వరలో త్రిష ఈ ఇంటికి షిఫ్ట్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.
పొన్నియన్ సెల్వన్ 1లో కుందవై యువరాణిగా తన అందంతో మెస్మరైజ్ చేసింది త్రిష. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చూసిన తర్వాత తమిళ స్టార్ హీరోల సినిమాల్లోనూ ఈమెకు అవకాశాలు వచ్చాయి. తమిళ నటుడు తలపతి విజయ్ 67 చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా షూటింగ్ ఈమధ్యే ప్రారంభమైంది. విజయ్ సినిమాతో పాటు అజిత్ సినిమాలో కూడా హీరోయిన్గా త్రిష ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. కానీ త్రిషకు బదులు నయనతార లేదా ఐశ్వర్యరాయ్ను తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఇది ఇంకా కన్ఫార్మ్ కాలేదు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Priya Bhavani Shankar | డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నా.. అయితే ఏంటి.. మీడియాపై హీరోయిన్ విసుర్లు
Rashmika Mandanna | డైరెక్టర్ దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. వాళ్ల వల్లే ఇక్కడ ఉన్నానంటూ పొగడ్తలు
PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..