Rashmika Mandanna | కాంతార డైరెక్టర్ దెబ్బకు రష్మిక మంధన్నా దిగొచ్చింది. మొన్నటిదాకా పేరు కూడా చెప్పడానికి కూడా ఇష్టపడని రష్మిక.. అతన్ని పొగడ్తలతో ముంచెత్తింది. తాజాగా రష్మిక మాట్లాడిన మాటలను చూస్తుంటే రిషబ్ శెట్టితో కొనసాగుతున్న వివాదం ఓ ముగింపునకు వచ్చినట్టే కనిపిస్తుంది.
ఈ మధ్యకాలంలో రష్మిక మంధన్నా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లోకి వస్తుంది. సోషల్ మీడియాలో ఈమెపై ట్రోల్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ముఖ్యంగా కాంతార డైరెక్టర్ రిషబ్ శెట్టి, రష్మిక మధ్య జరుగుతున్న గొడవ కారణంగా ట్రోలర్స్కు ఎక్కువగా టార్గెట్ అవుతూ వస్తుంది. దీనికి కారణం రష్మిక మంధన్నా ఆటిట్యూడ్ కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. రష్మికను ఇండస్ట్రీకి పరిచయం చేసింది రిషబ్ శెట్టి. అతని దర్శకత్వంలో వచ్చిన కిర్రాక్ పార్టీ సినిమాతో తొలిసారిగా కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాలో రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. వీళ్లిద్దరే రష్మికకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్తో రష్మికకు మంచి పేరొచ్చింది. అన్ని ఇండస్ట్రీల్లో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం రష్మిక కాస్త ఆటిట్యూడ్ చూపిస్తూ రిషబ్ శెట్టిని తీసిపారేసినట్టు మాట్లాడింది.
సినిమాల్లోకి ఎలా వచ్చిందో వివరిస్తూ.. కాలేజీ సమయంలో తన ఫొటోలు టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్లో వచ్చాయని.. అవి చూసి సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ పిలిచి సినిమా ఛాన్స్ ఇస్తామని అడిగిందని రష్మిక చెప్పింది. ఈ మాటలను నెటిజన్లు తప్పుబట్టారు. నిన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన పరంవా బ్యానర్ కూడా నీకు గుర్తు లేదా? అంత పొగరెందుకు అంటూ ఆమెను ట్రోల్ చేశారు. తన ఫస్ట్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార సినిమా నేషనల్ వైడ్ సంచలనం సృష్టించింది. ఈ సినిమా చూశారా అని అడిగితే కూడా చూడలేదంటూ సమాధానమిచ్చింది. దీంతో నెటిజన్లు ఆమెను బాగా ఆడేసుకున్నారు.
రష్మిక స్టేట్మెంట్స్ చూసిన రిషబ్ శెట్టి కూడా అంతే స్ట్రాంగ్గా రియాక్షన్స్ ఇచ్చాడు. ఆమె చేసిన సైగలను అనుసరిస్తూ అలాంటి వాళ్లతో సినిమాలు చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రీసెంట్గా కిర్రాక్ పార్టీ సినిమా విడుదలై ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పిన రిషబ్.. రష్మిక పేరు మాత్రం ప్రస్తావించలేదు.రీసెంట్గా కూడా రిషబ్ శెట్టి.. రష్మికను టార్గెట్ చేసి మాట్లాడాడు. ఒక దశలో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కన్నడిగులు.. రష్మికను కన్నడలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇలా పరిస్థితి ముదిరిపోవడంతో పాటు తనపై ట్రోల్స్ ఎక్కువ కావడంతో రష్మిక కాస్త తగ్గింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక.. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిపై పాజిటివ్ కామెంట్స్ చేసింది. వాళ్ల వల్లే ఇక్కడే ఉన్నానని.. వాళ్లు లేకపోతే తనకు ఇంత పేరు వచ్చేది కాదని తెలిపింది. ఎప్పటికీ వారికి రుణపడి ఉంటానని పొగడ్తలో ముంచెత్తింది. తన మీద వస్తున్న ట్రోలింగ్స్పై కూడా స్పందించింది. చాలావరకు మౌనంగానే ఉంటానని.. తనపై వచ్చి ట్రోలింగ్స్ను మొదట్లో పట్టించుకోలేదని రష్మిక తెలిపింది. అవేమీ తనను ఇబ్బంది పెట్టలేదని.. వాటి గురించి ఆలోచించలేదని చెప్పింది. కానీ ఇప్పుడు ఆ ట్రోల్స్ శృతి మించాయని.. తన కుటుంబాన్ని, చెల్లిని ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన చెల్లె మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే తన బాధ్యత అని.. వాళ్ల మీద ట్రోల్స్ వస్తే ఊరుకోనని, కచ్చితంగా రియాక్ట్ అవుతానని సీరియస్ అయ్యింది. మరి ఇప్పటికైనా రష్మికపై వస్తున్న ట్రోల్స్ ఆగుతాయేమో లేదో చూడాలి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
PVR Cinemas | రూ.99కే మూవీ టికెట్.. పీవీఆర్ సినిమాస్ బంపర్ ఆఫర్..
Raghu kunche | సింగర్ రఘు కుంచె ఇంట్లో విషాదం
honey rose | సీనియర్ హీరోలకు మంచి జోడి దొరికిందిగా.. మలయాళ బ్యూటీకి ఇదే సూపర్ ఛాన్స్