Srinidhi shetty | సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎలా ఉంటుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. ఒక్కోసారి డిజాస్టర్ అయిన సినిమా కూడా నటీనటులకు వరుస ఆఫర్లు తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు వందల కోట్లు వసూళ్లు చేసిన సినిమాల్లో భాగమైనా ఆఫర్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటుంది కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. 1200 కోట్లు వసూలు చేసిన కేజీఎఫ్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలో నటించిన శ్రీనిధికి అరకొర అవకాశాలు రావడం ఆశ్చర్యంగా ఉంది.
గతేడాది శ్రీనిధి నటించిన కోబ్రా విడుదలై భారీ పరాజయం మూటగట్టుకుంది. పైగా ఈ సినిమాలో శ్రీనిధి పాత్రకు పెద్దగా స్కోపే లేదు. ఈ సినిమా షూటింగ్ కూడా కేజీఎఫ్ మొదటి భాగం తర్వాతే మొదలైంది. కానీ పలు కారణాలతో కోబ్రా మూవీ విడుదల వాయిదా అవుతూ వచ్చింది.
కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత విడుదలైంది. ఈ లెక్కన చూసుకుంటే కేజీఎఫ్ సెకండ్ పార్ట్ తర్వాత ఈ బ్యూటీ ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆఫర్లు రాక చేయలేదో.. లేదంటే పెద్ద హీరోలతోనే నటిస్తానని మొండి పట్టు పట్టుకుని కూర్చుందో తెలియదు కానీ ఈ అమ్మడు ఇప్పటివరకు ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. అయితే తాజాగా శ్రీనిధికి టాలీవుడ్ నుండి ఓ భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తుంది.
వెంకటేశ్ 75వ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధి ఎంపిక అయినట్లు సమాచారం. హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తు్న్నాడు. జనవరి 26న ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాలో శ్రీనిధి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే వెంకటేశ్ వంటి సీనియర్ హీరోతో నటించడానికి శ్రీనిధి శెట్టి రెడీ అయినట్లు సమాచారం.
చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీనిధికి ఇది మంచి ఆఫరే. ఎందుకంటే సీనియర్ హీరోలతో సినిమాలు చేయకూడదని నియమం పెట్టుకోవడం ఈ రోజుల్లో కరెక్ట్ కాదు. ఈ విషయం తాజాగా శ్రీలీల విషయంలో రుజువైంది కూడా. ధమాకా చిత్రంలో 55ఏళ్ల రవితేజతో 21ఏళ్ల శ్రీలీల జోడీ కట్టి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రిలీజ్కు ముందు వీళ్ల జోడీపై ట్రోల్ చేసిన వారే.. రిలీజ్ తర్వాత వీరిద్ధరి డ్యాన్స్ వీడియోలను షేర్ చేసి పండగ చేసుకున్నారు. ఇక ఈ సినిమాతో శ్రీలీలకి బోలెడన్నీ ఆఫర్లు క్యూ కట్టాయి. అదే విధంగా శ్రీనిధికి కూడా కాస్త అదృష్టం కలిసొచ్చినా వరుస ఆఫర్లతో బిజీ అవుతుంది. మరీ టాలీవుడ్ సినిమాతోనైనా శ్రీనిధి జాతకం మారుతుందో లేదో చూడాలి.
ఇటీవలే హిట్-2 విజయంతో జోరు మీదున్న శైలేష్.. ప్రస్తుతం వెంకీ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నాడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతుంది. ఇక వెంకీ మామ కూడా గతేడాది ఎఫ్-3తో మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాడు. గెస్ట్ రోల్ పోషించిన ఓరీ దేవుడా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దాంతో తన తదుపరి సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. జనవరి చివర్లో పూజా కార్యక్రమాలు జరిపి రానున్న రెండు, మూడు నెలల్లో రెగ్యులర్ షూటింగ్ను జరపాలని శైలేష్ ప్లాన్లో ఉన్నాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Anupama parameswaran | డీజే టిల్లు సీక్వెల్లో అనుపమ ఫిక్స్.. అల్టర్నేట్ ప్రొఫేషన్ అంటూ పోస్టు