Telangana Congress | టీ కాంగ్రెస్ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. మాణిక్కం ఠాగూర్ను కాంగ్రెస్ సీనియర్ నేతలు మొదట్నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలుమార్లు సీనియర్ నేతలు ఆరోపించారు. రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శించారు.
అయితే ఇటీవల కాంగ్రెస్ కమిటీల విషయంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సేవ్ కాంగ్రెస్ నినాదంతో మీడియా ముందుకు వచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే పదవులు ఇచ్చారని రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మాణిక్కం ఠాగూర్పైనా విమర్శలు గుప్పించారు. దీంతో టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ కమిటీలో చోటు దక్కించుకున్న పలువురు నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. పరిస్థితి చక్కదిద్దేందుకు దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దించింది. ఆయన కాంగ్రెస్ నాయకులతో హైదరాబాద్లో చర్చలు జరిపారు. అధిష్ఠానానికి రిపోర్డు పంపారు.
ఇప్పుడా రిపోర్టు ఆధారంగానే మాణిక్కం ఠాగూర్ రాజీనామా చేసినట్లు సమాచారం. మాణిక్కం ఠాగూర్ స్థానంలో కొత్త ఇంచార్జిని నియమించాలని దిగ్విజయ్ అధిష్ఠానానికి రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది.
Read More Articles:
Telangana Congress | టీ కాంగ్రెస్ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్.. త్వరలో కొత్త ఇంఛార్జి
Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్లోనే మృతి
Telangana IPS | తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రకు అదనపు బాధ్యతలు
Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్