Telangana IPS | తెలంగాణలో భారీగా ఎత్తున ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ పోస్టింగులు ఇచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు తెలంగాణ స్టేట్ యాంటి నార్కొటిక్స్ బ్యూరో అడిషనల్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రేహండ్స్, ఆక్టోపస్ అడిషనల్ డీజీగా విజయ్ కుమార్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ అడిషనల్ డీజీగా నాగిరెడ్డి, హైదరాబాద్ సిటీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్గా విక్రమ్ సింఘ్ మాన్, తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రాజీవ్ రతన్ను నియమించింది.
వీరితో పాటు తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్గా సందీప్ శాండిల్యను ప్రభుత్వం నియమించింది. షీటీమ్స్ అడిషనల్ డీజీగా శిఖాగోయల్ను, టీఎస్ ఎస్పీ బెటాలియన్ అడిషినల్ డీజీగా స్వాతి లక్రా, అడిషనల్ డీజీ ఆర్గనైజేషన్ లీగల్గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా శివధర్ రెడ్డి, పోలీస్ వెల్ఫేర్ అండ్ స్పోట్స్ అభిలాష్ బిస్త్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ సుదీర్ బాబును హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్గా బదిలీ చేసింది. మల్టీ జోన్ 2 ఐజీగా షానవాజ్ ఖాశీం, శిక్షణ విభాగం ఐజీగా తరుణ్ జోషీ, ఐపీ పర్సనల్గా కమలాసన్ రెడ్డి, మల్టీ జోన్ 1గా చంద్రశేఖర్ రెడ్డి, ప్రొవిజనింగ్, లాజిస్టిక్స్ డిప్యూటీ ఐజీగా రమేశ్, ఇంటిలిజెన్స్ డిప్యూటీ ఐజీగా కార్తికేయ, రాజన్న జోన్ డిప్యూటీ ఐజీగా రమేశ్ నాయుడు, కార్ జాయింట్ కమిషనర్గా శ్రీనివాసులు, ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఐజీగా ఇక్భాల్, రాచకొండ జాయింట్ కమిషనర్గా గజరావ్ భూపాల్, యాదాద్రి డీఐజీగా రెమా రాజేశ్వరి, జోగులాంబ జోన్ డీఐజీగా ఎల్ఎస్ చౌహాన్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్గా నారాయణ్ నాయక్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ అడ్మిన్గా పరిమళ హనా నూతన్, సీఐ సెల్ ఇంటిలిజెన్స్ ఎస్పీగా భాస్కరన్, పోలీస్ కంప్యూటర్స్ సర్వీసెస్ అడిషనల్ డీజీగా వీవీ శ్రీనివాస రావులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.