Air Asia | దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాకు పౌర విమానయాన ప్రాధికార సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. ఎయిర్ ఏషియా కంపెనీకి రూ.20 లక్షల జరిమానా విధించింది. అంతర్జాతీయ పౌర నిబంధనల ప్రకారం పైలట్కు నిర్వహించే సామర్థ్య పరీక్షల సమయంలో సరైన నిబంధనలు పాటించడంలో ఎయిర్ ఏషియా విఫలమైనట్లు డీజీసీఏ గుర్తించింది.
డీజీసీఏ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించడంలో విఫలమైనందుకు గానూ ఎయిర్లైన్స్ ట్రైనింగ్ విభాగాధిపతిని మూడు నెలల పాటు విధుల్లో నుంచి తొలగించింది. ట్రైనింగ్ టీమ్లో ఉన్న ఎనిమిది మందికి రూ.3 లక్షల ఒప్పున జరిమానా విధించింది. వీటితో పాటు షో కాజ్ నోటీసులు కూడా పంపింది. రూల్స్ ఎందుకు పాటించలేదో రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇప్పటికే తరచూ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా డీజీసీఏ అన్ని సంస్థలపైనా ప్రత్యేక నిఘా పెడుతోంది. ఏ చిన్న లోపం ఉందని తెలిసినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఎయిర్ ఏషియాను మందలించి జరిమానా వేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
USA | చైనా గూఢచార బెలూన్ తర్వాత మళ్లీ అమెరికా గగనతలంలోకి అనుమానాస్పద వస్తువు
KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్
Ration Cards | తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం