Naresh | సీనియర్ నటుడు నరేశ్ తన మూడో భార్య రమ్య రఘుపతి గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రమ్యతో నరకయాతన అనుభవిస్తున్నానని చెప్పాడు. రూ.10 కోట్లు ఇవ్వాలని ఆమె బెదిరిస్తుందని తెలిపాడు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో తనను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ను కలిసి కుట్ర పన్నిందని ఆరోపించాడు.
తన సహచర నటి పవిత్ర లోకేశ్తో ప్రేమ వ్యవహారం కారణంగా ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్గా నిలిచాడు సీనియర్ నటుడు నరేశ్. వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ ఉందని నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి బయటపెట్టింది. బెంగళూరులోని ఓ లాడ్జిలో పవిత్ర, నరేశ్ ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టింది. అప్పట్నుంచి వీళ్ల వ్యవహారం సినీ ఇండస్ట్రీలో వైరల్గా మారింది. తమ ప్రేమ వ్యవహారం బయటపడటంతో అప్పట్నుంచి పవిత్ర, నరేశ్ ఇద్దరూ కలిసి బహిరంగంగానే తిరగడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్టు న్యూ ఇయర్ సందర్భంగా ఓ వీడియో ద్వారా పవిత్రా నరేశ్ బయటపెట్టారు. దీనిపై రమ్య రఘుపతి కూడా అప్పట్లోనే రియాక్ట్ అయ్యింది. నరేశ్ తనను ఎన్నో రకాలుగా వేధించేవాడని, అక్రమ సంబంధాలు అంటగట్టేవాడని రమ్య రఘుపతి పేర్కొంది. నరేశ్కు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా లేనని ప్రకటించింది. తనకు డబ్బుల కంటే కూడా తన బాబుకు నాన్న ముఖ్యమని తెలిపింది. ఈ విషయంపై తాజాగా నరేశ్ స్పందించాడు.
అప్పట్లోనే నన్ను చంపేందుకు రెక్కీ చేశారు
రమ్య రఘుపతి అడిగిన రూ.10 కోట్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనను హత్య చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించాడు. తనను చంపేందుకు 2022లోనే కొంతమంది రెక్కీ నిర్వహించారని తెలిపారు. రమ్య నుంచి తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే కోర్టును ఆశ్రయించానని చెప్పాడు. తన ఫోన్ను హ్యాక్ చేసిందని సైబర్ కోర్టులో కూడా ఫిర్యాదు చేశామని తెలిపాడు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kodali Nani | నందమూరి వారసులకు భయపడే నారా లోకేశ్ పాదయాత్ర.. యువగళంపై కొడాలి నాని కౌంటర్
Pawan Kalyan | పవన్ కళ్యాణ్కు.. కేఏ పాల్కు పెద్ద తేడా లేదు.. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్
Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు