WTC 2023 | వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్కు టీమిండియా చేరింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ ఫలితం తేలకముందే భారత్ ఈ అవకాశం దక్కించుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు పోటీ పడుతున్న శ్రీలంకను న్యూజిలాండ్ ఓడించడంతో టీమిండియా ఫైనల్ కు చేరే మార్గం సుగమం అయ్యింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండానే ఫైనల్కు చేరింది.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 70 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో కేన్ విలియమ్స్ (121) కీలక ఇన్నింగ్స్ ఆడి.. న్యూజిలాండ్ను విజయతీరానికి చేర్చాడు. పరోక్షంగా టీమిండియాకు సహకరించాడు. ఫలితంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.