Trisha Political Entry | సినిమాల్లోకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇంకా తరగని అందంతో కుర్రకారును మాయచేస్తుంది త్రిష. ఇప్పటికీ వరుస అవకాశాలను అందుకంటూ కెరీర్లో దూసుకెళ్తోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న త్రిష.. మరోవైపు రాజకీయాల్లో కూడా రాణించాలని అనుకుంటుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని త్రిష నిర్ణయించుకున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో పలు కథనాలు వచ్చాయి. వీటిపై త్రిష వాళ్ల అమ్మ ఉమా కృష్ణన్ కూడా అప్పట్లో స్పందించింది.
తమిళనాడు రాజకీయాల్లో ముందు నుంచీ సినీ ప్రముఖులు సత్తా చాటుతూనే ఉన్నారు. దివంగత ఎంజీఆర్, జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రులుగా సేవలందించి తిరుగులేని నాయకులుగా ఎదిగారు. ఖుష్భూ, కమల్ హాసన్, విజయ్ కాంత్ ఇలా పలువురు సినీ నటులు తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు.ఈ క్రమంలోనే తమిళనాట తమ పార్టీ బలోపేతం కోసం సినీ గ్లామర్ను వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోందట. అందుకే యూత్లో మంచి క్రేజ్ ఉన్న త్రిషను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ప్రముఖ కోలీవుడ్ స్టార్ కూడా రాజకీయాల్లోకి వెళ్లాలని త్రిషను ప్రోత్సహిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ ఇవన్నీ వట్టి పుకార్లేనని త్రిష తల్లి ఉమా కృష్ణన్ అప్పట్లో స్పష్టం చేసింది. తమ కూతురికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ వార్తలు ఆగలేదు. ఈ క్రమంలో త్రిషనే స్వయంగా స్పందించింది. రంగి సినిమా ప్రమోషన్లో పాల్గొన్న త్రిష పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది.
కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు త్రిష స్పందించింది. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పింది. తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని సూచించింది.
Read More Articles |
Tollywood 2022 | కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సహా 2022లో మరణించిన సెలబ్రెటీలు వీళ్లే.
Disaster movies of 2022 | ఈ ఏడాది టాలీవుడ్లో అత్యంత డిజాస్టర్ అయిన మూవీస్ ఇవే..
Sneha divorce | సినీ నటి స్నేహ విడాకుల రూమర్స్.. ఆ ఒక్క ఫొటో చెక్ పెట్టినట్లేనా?
kalpika ganesh | వాళ్లందరి బండారం బయటపెడతా.. కల్పిక గణేశ్ వార్నింగ్